మహేష్ కు నో చెప్పింది!

  • July 30, 2016 / 11:37 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు హీరోయిన్స్. అలాంటిది మహేష్ సినిమాకు నో చెప్పి ఆశ్చర్యపరచింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి. మురగదాస్.. మహేష్ తో  కలయికలో ఓ భారీ బడ్జెట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ పరిశీలించారు. చివరిగా రరకుల్ ప్రీత్ సింగ్ ను  ఫైనల్ చేశారు. అయితే ఇలా పరిశీలించిన పేర్లలో  శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కూడా వుందట. జాన్వి ఎలాగో హీరోయిన్ అవుదాం అనుకుంటోంది కాబట్టి.. ఆమెతో తెరంగేట్రం చేయించాలని చూశారట దర్శకుడు మురుగుదాస్. ఇప్పటికే లాస్ ఏంజెలిస్ లోని యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న అమ్మడిని సంప్రదిస్తే ” ఇప్పుడప్పుడే నేను చేయలేను.. నేను ఇంకా రెడీగా లేను” అని చెప్పిందట. అ తర్వాత పరిణితి అప్రోచ్ అవ్వడం , అమెకు కుదరకపోవడం. చివరికి రకుల్ ను ఓకే చేయడం జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus