నితిన్ సినిమా కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం

  • July 27, 2018 / 01:20 PM IST

యువ హీరో నితిన్ కి ప్రస్తుతం హిట్ కోసం చూస్తున్నారు. అతని గత చిత్రాలు లై, చల్ మోహన్ రంగ రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈసారి శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో “శ్రీనివాస కళ్యాణం” అనే చిత్రాన్ని చేశారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ మూవీ ఆగస్ట్ 9 న విడుదలకానుంది. అయితే ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ షికారు చేస్తోంది. ఈ చిత్ర కథ ఇదే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కథ ఎలా ఉంటుందంటే.. సంపన్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. కానీ వారికి పెళ్లి మీద సరైన నమ్మకం ఉండదు.

దాంతో ఎప్పుడన్నా గొడవలు వస్తే విడిపోవచ్చనే అగ్రిమెంట్ మీద ఇద్దరూ కట్టుబడి ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న పెద్దవాళ్ళు, పెళ్లి మీద హీరో హీరోయిన్లకు పెళ్లి విశిష్టతను చాటి చెప్పేలా వారిని ప్రేరిపించి, వారికి కనువింపు కలిగిస్తారట… మరి ఈ కథ ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ కథ విన్న వారంతా ఇది మాములు కథే అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఈ కథని సతీష్ వేగేశ్న విభిన్నంగా, మనసుకు హత్తుకునేలా చిత్రీకరించి ఉంటారని భావిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus