రంగస్థలం చూసి అభిప్రాయాన్ని షేర్ చేసుకున్న మహేష్, రాజమౌళి

  • April 7, 2018 / 06:32 AM IST

సుకుమార్, రామ్ చరణ్ కలయికలో రూపుదిద్దుకున్న రంగస్థలం గత నెల 30 న రిలీజ్ అయి అందరి మనసులు గెలుచుకుంటోంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాని చూసిన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సుకుమార్, రామ్ చరణ్, సమంతను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రసంశలు గుప్పించారు. “సినిమా చాలా ఇంటెన్స్ గా ఉంది. సుకుమార్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్” అని మహేష్ ట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్, సమంతల కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిస్తుందని, మైత్రి మూవీస్ వారు మరోసారి మంచి చిత్రాన్ని నిర్మించారని వెల్లడించారు. “చిట్టిబాబు పాత్రను సుకుమార్ రాసిన, తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది.

చరణ్ నటన చూసేందుకు ఒక ట్రీట్ లా ఉంది” అని రాజమౌళి అభినందించారు. మహేష్ బాబుకి సుకుమార్ ఒక అపజయాన్ని ఇచ్చారు. అవేమి మనసులో పెట్టుకోకుండా మాస్టర్ ఆఫ్ ఆర్ట్ అని అతన్ని పొగిడి మహేష్ రియల్ సూపర్ స్టార్ అనిపించారు. రాజమౌళి చరణ్ తో ఇదివరకు మగధీర తీశారు. ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చరణ్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాని త్వరగా కంప్లీట్ చేసి జక్కన్నకి డేట్స్ కేటాయించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus