Sharwanand: కొరియోగ్రాఫర్ తో శర్వా సినిమా!

  • September 22, 2021 / 07:12 PM IST

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. కొన్నాళ్లక్రితం ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా ప్రస్తుతం ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తున్నాడు. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయబోతున్నారు.

తాజాగా మరో కొత్త సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం చాలా కాలంగా తెలుగులో దర్శకుడిగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో శర్వానంద్ తో చాన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నాడు. ఫైనల్ గా శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించనున్నారు. గతంలో రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయింది. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్లీ రైటర్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ‘ఏజెంట్’ సినిమాకి కూడా వంశీనే కథ అందిస్తున్నాడు. దీంతో పాటు శర్వానంద్-రాజు సుందరం సినిమాకి కూడా స్క్రిప్ట్ అందించనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే దీని గురించి అధికార ప్రకటన రానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus