ఎన్టీఆర్(NTR) – అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల విషయంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి కాదు రెండుసార్లు ఆల్మోస్ట్ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. విషయంలోకి వెళితే.. జనతా గ్యారేజ్ (Janatha Garage) తర్వాత దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) మరో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘యువ సుధా ఆర్ట్స్’ అధినేత మిక్కిలినేని సుధాకర్ ఈ ప్రాజెక్టుతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు.
కానీ తర్వాత అది ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. కొన్నాళ్ల తర్వాత అదే ప్రాజెక్టు అల్లు అర్జున్ తో చేస్తున్నట్లు కూడా అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ‘పుష్ప’ (Pushpa) తో అల్లు అర్జున్ (Allu Arjun) బిజీగా ఉండటం వల్ల.. ఆ ప్రాజెక్టు మళ్ళీ ఎన్టీఆర్ వద్దకే వెళ్ళింది. అలా ‘దేవర’ గా బయటకు వచ్చింది.
ఇప్పుడు ఇలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి ఏమవుతుందంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ (R.R.R) ర్వాత ఎన్టీఆర్ (NTR) నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)దర్శకత్వంలో ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. అటు తర్వాత అంటే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ (Allu Arjun)తో ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.
బన్నీ… అట్లీ సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో అదే కథని ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తుంది. ఇలా ఆగిపోయాయి అనుకున్న ఎన్టీఆర్ (NTR) ప్రాజెక్ట్స్ మళ్ళీ ఎన్టీఆర్ (NTR) వద్దకే వెళ్లడం.. మధ్యలో అల్లు అర్జున్ (Allu Arjun) ను కూడా టచ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.