రంగస్థలం హీరోగా చరణ్ ని ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సుకుమార్

  • April 3, 2018 / 09:33 AM IST

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా చిత్రం రంగస్థలం. సుకుమార్, రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల కలక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ చిట్టి బాబు పాత్ర కోసం రామ్ చరణ్ ని సుకుమార్ ఎలా సెలక్ట్ చేశారు? ఇంత చక్కగా చెర్రీ ఈ పాత్రలో ఒదిగి పోతారని ఎలా అనుకున్నారు? అనే ప్రశ్నలు అందరినీ తొలిచివేసింది. అందుకు నిన్న జరిగిన రంగస్థలం థాంక్స్ మీట్ లో సుకుమార్ వెల్లడించారు. “చరణ్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. కానీ వాటిలో క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా ఒక్కటి కూడ చేయలేదు.

అందుకే పాత్ర మీద ఆధారపడిన కథను రాసుకున్నాను. అదే నా సీక్రెట్. ఏ నటుడైన మంచి పాత్ర పడితే ఆడేసుకుంటాడు. ఇలాంటి పాత్ర చరణ్ కు ఇంతకుముందే పడుంటే ఈ వండర్ అప్పుడే జరిగుండేది” అని అన్నారు. అనంతరం చరణ్ మాట్లాడుతూ..” నేనెప్పుడూ అభిమానుల కోసం సినిమాలు ఒప్పుకోలేదు. ముందు కథ నాకు నచ్చితేనే అందరికీ నచ్చుతుందని అనుకునేవాడిని. రంగస్థలం విషయంలోనూ అదే జరిగింది” అని వెల్లడించారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ విదేశాల్లోను ఎక్కువ కలక్షన్స్ సాధిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus