సుకుమార్ నెక్స్ట్ సినిమా చిరంజీవితోనేనా ?

  • January 27, 2018 / 10:42 AM IST

సుకుమార్ తన కెరీర్ ని మెగా హీరోతోనే మొదలెట్టారు. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో డైరక్టర్ గా మారిన సుకుమార్ ఆ తరవాత తెలుగు యువ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో రంగస్థలం సినిమా చేస్తున్నారు. నేటి ట్రెండ్ కి భిన్నంగా పాతికేళ్ల కథని తీసుకొని వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారు. అంతేకాదు హీరోకి.. మెగా హీరోకి వినికిడి లోపం పెట్టి మరీ సాహసం చేస్తున్నారు. ఈ కథను సుకుమార్ చెప్పిన విధానం.. చూపించనున్న విధానం రెండూ బాగున్నాయని చరణ్ సంతోషపడుతున్నారు. ఈ విషయాన్నీ చెర్రీ.. తన తండ్రి చిరంజీవికి చెప్పడంతో సుకుమార్ ని ఆయన అ భినందించారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ ఆనందకర సమయంలో సుకుమార్ చిరుకి ఓ లైన్ వినిపించారంట.

ఆ లైన్ కొత్తగా ఉండడంతో చిరు ప్లాట్ అయినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని సూచించారంట. ప్రస్తుతం రంగస్థలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నా సుకుమార్.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రిప్ట్ పనుల్లోకి దిగనున్నారు. చిరంజీవి కూడా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి చాలా సమయం అవుతుంది. అప్పటిలోపున బాగా స్క్రిప్ట్ రాసి చిరు ని మెప్పించాలని సుకుమార్ భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి చరణ్ కి హిట్ ఇచ్చిన తర్వాత చిరుతో మూవీ చేస్తున్నారు. అలాగే సుకుమార్ చెర్రీకి హిట్ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ తో మూవీ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus