వినయ విధేయ రామ గద్ద సీన్ ను మళ్లీ కెలికిన సందీప్

  • September 16, 2019 / 08:25 PM IST

“వినయ విధేయ రామ” అనంతరం రాజమౌళితో సినిమా కమిట్ అయ్యి రామ్ చరణ్ తప్పించుకున్నాడు కానీ.. పాపం బోయపాటి మాత్రం చాన్నాళ్లు ఆ ఫ్లాప్ తాలూకు ట్రోలింగ్ ను భరించాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే చరణ్ & బోయపాటి ఆ ఫ్లాప్ తాలూకు గోలను మర్చిపోతున్న తరుణంలో.. సందీప్ కిషన్ మళ్ళీ పాత గాయాన్ని కెలకడమే కాక.. ఆ గాయంపై గొడ్డు కారం జల్లాడు. సందీప్ కిషన్-హన్సిక జంటగా తెరకెక్కిన “తెనాలి రామకృష్ణ” టీజర్ నిన్న విడుదలయింది.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ యంగ్ లాయర్ గా కనిపించనున్న ఈ చిత్రం టీజర్ లో సప్తగిరి ఒక సందర్భంలో “తల ఎగరాల్సిందే.. గద్ద ఎత్తుకెళ్లాల్సిందే” అని “వినయ విధేయ రామ” సినిమాలోని మోస్ట్ ట్రోల్డ్ సీన్ ను మళ్ళీ ట్రోల్ చేయడం అనేది చర్చనీయాంశం అయ్యింది. సాధారణంగా సూపర్ హిట్ సినిమాలకు స్పూఫ్ లు తీయడం కామన్. కానీ.. ఇలా ఒక డిజాస్టర్ సినిమా మీద సందీప్ కిషన్ కామెడీ చేయడాన్ని చరణ్ ఫాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus