నారా రోహిత్, నాని బాటలో సునీల్!

  • October 18, 2016 / 08:50 AM IST

కమెడియన్ నుండి హీరోగా మారాక సునీల్ పరిస్థితి ఏమిటన్నది సినీజనమెరిగినదే. ‘పూలరంగడు’ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కోసం ‘భీమవరం బుల్లోడు’గా ‘జక్కన్న’గా పలు రూపాలు మారుస్తున్నాడు. అయితే విజయం సునీల్ కి అందనంత సుదూరంగా ఉండిపోయింది. ఆ విషయం ఇటీవల విడుదలైన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాతోనూ నిరూపితమైంది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం క్యాలెండర్ మారేలోపే మరో సినిమాతో తెరమీదికి రానున్నాడు సునీల్.

‘ఓనమాలు’ లాంటి సినిమాతో మెగాఫోన్ పట్టి, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి ఫీల్ గుడ్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ సునీల్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పరచూరి కిరీటి నిర్మిస్తోన్న ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘ఉంగరాల రాంబాబు’ పేరుతో తెరకెక్కుతోన్న ఈసినిమాని డిసెంబర్ 23న బాక్సాఫీస్ బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. విడుదలలో ఆలస్యమైన ‘కృష్ణాష్టమి’ సహా సునీల్ నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది తెరమీదికొచ్చాయి. ఇప్పుడు నాలుగో సినిమా రానుంది. ఈ వరుస చూస్తుంటే సునీల్ నారా రోహిత్, నాని బాటలోనే నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే వారికి విజయాలున్నాయి. ఇతగాడి ఖాతాలో అంతా శూన్యం. అంతే తేడా. ఈ సినిమా అయినా ఆ లోటు పూడ్చుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus