మెగాస్టార్ 152 చిత్రంలో హీరోయిన్ గా నటించనున్న తమన్నా!

  • September 28, 2018 / 07:32 AM IST

ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమాతో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న కొరటాల చిరుకి ఓ  మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

ఈ మూవీ స్క్రిప్ట్ ని పూర్తి చేసిన కొరటాల ఆర్టిస్టుల సెలక్షన్ పడ్డారు. హీరోయిన్ గా ముందుగా అనుష్క పేరుని పరిశీలించిన కొరటాల చివరకి తమన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. సైరా లోని తమన్నా చిన్న రోల్ పోషిస్తోంది. ఆమె డెడికేషన్ చూసి ఫిదా అయిన చిరంజీవి తమన్నా పేరును డైరక్టర్ కి సజెషన్ చేసినట్లు సమాచారం. ఈ జోడి కొత్తగా ఉంటుందని భావించి కొరటాల కూడా ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పటిలోపున మిగిలిన ఆర్టిస్టుల సెలక్షన్ పూర్తి చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus