శ్రీదేవి అవార్డు అందుకున్న మిల్కీ బ్యూటీ!

  • August 28, 2018 / 05:06 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి వందల చిత్రాల్లో నటించి కోట్లమంది అభిమానాన్ని పొందింది. అనేక అవార్డులను అందుకుంది. హఠాత్తుగా మరణించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ సినిమాల రూపాల్లో బతికేవుంది. ఆమె జ్ఞాపకంగా సురేష్ కొండేటి శ్రీదేవి పేరుతో అవార్డును నెలకొల్పారు. అతను గత పదహారేళ్లుగా సినీ పరిశ్రమల్లో విశేష సేవలు అందించిన వారికీ సంతోషం అవార్డ్స్ అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా అవార్డుల వేడుకని వైభవంగా నిర్వహించారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన వేడుకలో తమన్నా.. శ్రీదేవి అవార్డు అందుకుంది. ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి తమన్నాకి ప్రదానం చేశారు. తమన్నా ఆరాధించే నటీమణుల్లో శ్రీదేవి ఒకరు.

ఆమె బయోపిక్ తీస్తే అందులో నటించాలని మిల్కీ బ్యూటీ కలలుకంటోంది. ఈ తరుణంలో ఆమె పేరుతో నెలకొల్పిన అవార్డును సొంతం చేసుకోవడం తమన్నాకి ఆనందాన్ని మిగిల్చింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ “ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి”లో న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి “సైరా న‌ర‌సింహారెడ్డి”లో కీల‌క పాత్ర పోషిస్తోంది. అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న F2 లోను విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది. అలాగే బులితెరలో ఓ రియాలిటీ డ్యాన్స్ షోకి గెస్ట్ గా వ్యవహరిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నా వేగం తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే జోరు పెరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus