నా పాట హిట్టయినా దేవి ఫోన్ మాట్లాడలేదు : తమన్

  • December 27, 2019 / 06:58 PM IST

సంక్రాంతి పోటీ అనేది కేవలం మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల మధ్య మాత్రమే కాదు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా ఏర్పడింది అనే విషయం ఈ పాటికే అందరికీ అర్థమైపోయుంటుంది. స్ట్రెయిట్ గా పాయింట్ కి వచ్చేస్తే.. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జోరు బాగా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరో పక్క ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే ‘అల వైకుంఠపురములో’ పాటల్ని మ్యాచ్ చేశాయా.. అంటే అవుననీ చెప్పలేము.. అలాగని కాదని చెప్పలేము.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్.. దేవి శ్రీ ప్రసాద్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘సామజవరగమన’ పాట అంత హిట్టైంది కదా దేవి మీకు ఫోన్ చేసి విష్ చేశాడా అని విలేకరి అడిగిన ప్రశ్నకి తమన్ మాట్లాడుతూ… ” లేదు.. అలా చెయ్యలేదు.. మేమిద్దరం మాట్లాడుకుని 6,7 నెలలు అవుతుంది. నా పుట్టినరోజున మాత్రం ట్విట్టర్లో విష్ చేశాడు.దేవి చేసిన ‘రెడీ’ ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలకు నేను ప్రోగ్రామర్ గా పనిచేసాను.” అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus