Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ – తమన్‌ కాంబోను చూడొచ్చు’ అని చూచాయగా చెప్పారు. దీంతో సంగీతాభిమానులు ఆ ఫ్రేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కట్‌ చేస్తే ఈవెంట్‌ అయిపోయింది.. అలాంటి ఫ్రేమ్‌ ఏమీ కనిపించలేదు. ఆ ఈవెంట్‌ తర్వాత హరీశ్‌ స్పెషల్‌ వీడియో ఒకటి రిలీజ్‌ చేశారు. అందులో రాశీ ఖన్నాను పొగిడేసిన హరీశ్‌.. తమన్‌ ఎందుకు ఈవెంట్‌కి రాలేదో చెప్పారు.

Thaman

ప్రీ రిలీజ్‌ వేడుకలో చిత్ర బృందంలోని కొంతమంది కీలక వ్యక్తుల గురించి మాట్లాడలేకపోయానని.. దానికి గల కారణాన్ని వివరిస్తూ ఆయా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు హరీశ్‌ శంకర్‌. పవన్‌ కల్యాణ్‌ను వెయిట్‌ చేయించామనే టెన్షన్‌, ప్రీ ప్రొడక్షన్‌ పనుల అలసట వల్ల కొందరి గురించి మాట్లాడటం మర్చిపోయాను. రాశీ ఖన్నా ఈ సినిమా కథ కూడా వినకుండానే నటించింది. పవన్‌ కల్యాణ్‌తో కలసి నటిస్తే చాలన్నది ఆమె డ్రీమ్‌. అందుకే చేసింది అని చెప్పారు.

ఇక ఈ సినిమా నేపథ్య సంగీతం అందిస్తున్న తమన్‌ గురించి మాట్లాడుతూ ఆయనకు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా తక్కువే. పవన్‌ సినిమాలకు తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే అందరూ చూశారు. ఇప్పుడు దానికి మించి ఉంటుందని చెప్పారు. అలాగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ రావట్లేదు.. నువ్వైనా రా అని తమన్‌ని అడిగితే.. ‘ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌. నేను ఇస్తోంది స్కోర్‌ మాత్రమే. కాబట్టి నేను వెనకే ఉంటా అని అన్నారు అని హరీశ్‌ చెప్పారు.

ఈ నెల 26న విడుదల చేయాల్సిన సినిమాను 19నే తీసుకొస్తున్నావు. నాకు మ్యూజిక్‌ చేయడానికే టైమ్‌ లేదు, ఈవెంట్‌కు ఎలా రాగలను అని తమన్‌ అన్నాడని హరీశ్‌ చెప్పారు. ఆ మాటతో తమన్‌ సంస్కారం ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదిగింది అనిపించిందని చెప్పారాయన.

జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus