Virata Parvam: సురేష్ బాబు సినిమాలు థియేటర్ లో రావా..?

  • July 13, 2021 / 11:47 AM IST

సీనియర్ హీరో వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 20న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అలానే వెంకీ నటించిన ‘దృశ్యం 2’ సినిమాను హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలను సురేష్ బాబు తన బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలకు మంచి ఓటీటీ ఆఫర్లు రావడంతో డీల్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్ లో తెరకెక్కిన మరో సినిమా ‘విరాటపర్వం’ కూడా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉందంటూ వార్తలొస్తున్నాయి.

రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోవడానికి చూస్తోంది. ఈ మేరకు మంచి ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దాదాపుగా ఈ డీల్ ఖరారైనట్లే అని చెబుతున్నారు.ఇండస్ట్రీలో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలన్నింటినీ థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ సురేష్ బాబు మాత్రం తన సినిమాలను ఓటీటీలకు అమ్మేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఆయనకు ఇష్టం లేదని..

ఆ కారణంగానే తన సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అక్టోబర్ వరకు సినిమాలను హోల్డ్ లో పెట్టమని రిక్వెస్ట్ చేసినా.. సురేష్ బాబు మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus