Krish: క్రిష్ సైలెన్స్ వెనుక రీజన్ ఇదేనా..?

  • April 5, 2021 / 12:30 PM IST

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా హిట్ కావడంతో వైష్ణవ్ తేజ్ క్రిష్ కాంబినేషన్ లో కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాకు బిజినెస్ బాగా జరుగుతోంది. వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం, రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా వైష్ణవ్ తేజ్ కు జోడీగా రకుల్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

అయితే షూటింగ్ పూర్తైనా ఈ సినిమా ప్రమోషన్ విషయంలో మాత్రం క్రిష్ సైలెంట్ గా ఉండటం గమనార్హం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తూ క్రిష్ బిజీగా ఉన్నారు. క్రిష్ వైష్ణవ్ తో తెరకెక్కించిన ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయాలని భావిస్తున్నారని ఆ కారణం వల్లే ఈ సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు కూడా సినిమా ఆలస్యంగా రిలీజ్ కావడానికి కారణమని తెలుస్తోంది.

ఉప్పెన సినిమాకు పూర్తిగా భిన్నమైన పాత్రలో క్రిష్ సినిమాలో వైష్ణవ్ నటించాడని వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయడం కంటే కొంత కాలం గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయడం మంచిదని క్రిష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మెగాఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టైనా ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉంటూ క్రిష్ తమను టెన్షన్ పెడుతున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus