రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ సినిమాలో మరో హీరో!

  • January 30, 2018 / 04:19 PM IST

ఆలస్యం అమృతం విషం అనే మాట కంటే.. నిదానమే ప్రధానం అనే మాటను ఎక్కువగా నమ్మిన వ్యక్తి రాజమౌళి. ఆయన వేసే ప్రతి అడుగు నాలుగైదు సార్లు అలోచించి వేస్తారు. అందుకే అతని కెరీర్ లో అపజయం అనే మాటకి స్థానం లేకుండా పోయింది. బాహుబలి వంటి అద్భుతమైన సినిమాని తీసిన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని సిద్ధం చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ హర్ట్ అవకుండా సమానమైన సీన్లను రాయడం పూర్తి అయినట్లు తెలిసింది. ఇద్దరు పవర్ ఫుల్ హీరోలు నటిస్తున్న ఈ కథలో విలన్ మరింత బలంగా ఉండాలి. ఉండాలి కాదు.. చాలా ప్రతిభావంతుడిగా, శక్తి వంతుడిగా విలన్ క్యారెక్టర్ ని విజయేంద్ర ప్రసాద్ పేపర్ పై  సృష్టించారు.

ఆ రూపాన్ని వెండితెరపైన ఆవిష్కరించడానికి తగిన యాక్టర్ ని రాజమౌళి సెలక్ట్ చేసినట్లు తెలిసింది. అతను ఇప్పటివరకు హీరోగా మెప్పించిన నటుడని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ చిత్రం ద్వారా విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు వెల్లడించారు. సో ఈ లెక్కన ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు నటించబోతున్నారన్నమాట. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.  దీని తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన  తర్వాత  రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus