వర్కింగ్ టైటిల్ నే ఖరారు చేసిన అఖిల్, వెంకీ చిత్ర బృందం

  • August 10, 2018 / 11:28 AM IST

తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో అఖిల్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రధాన పాత్ర దారులు పాల్గొంటున్నారు. అఖిల్ ప్లే భాయ్ గా కనిపించనున్న ఈ చిత్రానికి నాగార్జున హిట్ మూవీ మజ్ను అనే పేరుని ఫిక్స్ చేసినట్లు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ వర్కింగ్ టైటిల్ మాత్రమే.. టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదని గతంలో అఖిల్ కూడా స్పష్టం చేశారు. తాజాగా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

లవ్ రొమాంటిక్ కథకి ఇంతకు మించి మంచి టైటిల్ ఏదీ దొరక్కపోవడంతో ఇదే ఫిక్స్ చేసినట్లు సమాచారం. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చే పనిలో ఎస్ఎస్ థమన్ ఉన్నారు. అఖిల్ గత రెండు చిత్రాలు కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయాయి. ఈ సినిమాతో ఆలోటుని తీర్చాలని అఖిల్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. యువతకి కనెక్ట్ అయ్యే తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. నాగార్జునకి డిసెంబర్ సెంటిమెంట్ మంత్. అందుకే అదేనెలలోనే థియేటర్లోకి తీసుకురానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus