తన తల్లిదండ్రుల గురించి.. అఖిల్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  • December 18, 2019 / 06:08 PM IST

సాధారణంగా వారి పర్సనల్ విషయాల గురించి అలాగే కుటుంబ విషయాల గురించి స్పందించడానికి సెలబ్రిటీలు కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ మన అఖిల్ హీరోయిన్ మాత్రం అలాంటి ఇబ్బంది పడకుండా తన కుటుంబ విషయాలని చాలా ఓపెన్ గా.. ధైర్యంగా చెప్పుకొచ్చింది. ‘హలో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. ఆ తరువాత ‘చిత్రలహరి’ ‘ రణరంగం’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ నటిస్తున్న ‘హీరో’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తల్లి దండ్రులు విడాకుల విషయం పై ప్రశ్నలు ఎదురయ్యాయి. కళ్యాణి తల్లిదండ్రులు అయిన ప్రియదర్శన్, నటి లిజీ 1990లో వివాహం చేసుకున్నారు. 25 ఏళ్ళ పాటు కొనసాగిన వీరి వివాహ బంధానికి 2016 సంవత్సరంలో బ్రేక్ పడింది. కొన్ని మనస్పర్థలు కారణంగా లిజీ, ప్రియదర్శన్ విడాకులు తీసుకున్నారు.

ఈ విషయాల పై కళ్యాణి ప్రియదర్శన్ జవాబిస్తూ.. “నా తల్లిదండ్రులు విడిపోవడం నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే మా కుటుంబంలో ప్రశాంతత, సంతోషం మాత్రం అలాగే ఉన్నాయి. మా అమ్మా.. నాన్నా విడిపోవడం మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది కానీ ఆ ప్రభావం కుటుంబం పై ఎంతమాత్రం పడలేదు. వారి మధ్య ఉన్న గొడవలతో మమల్ని ఇబ్బంది పెట్టలేదు.. పెట్టరు కూడా..! ఆ విషయంలో వారికి థాంక్స్ చెప్పాలి. ఇప్పటికీ నాతో వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. నాకు ఎటువంటి అవసరం వచ్చినా వారు వెంటనే నా దగ్గరకు వచ్చేస్తారు” అంటూ చెప్పుకొచ్చింది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus