ఫ్యామిలీస్ తో మాల్దీవులకు వెళ్ళొచ్చిన టాలీవుడ్ తారలు..!

Advertisement

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన సినిమా తారలు.. ఆ తరువాత షూటింగ్ లు ప్రారంభం అవ్వడంతో గ్యాప్ లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కాస్త గ్యాప్ దొరికినప్పుడు సేద తీరడానికి అలా మాల్దీవులకు చెక్కేశారు. కాజల్ హనీమూన్ ట్రిప్ తో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత టాలీవుడ్ నుండీ చాలా జంటలు అక్కడికి వెళ్లి వచ్చాయి. ఓ విధంగా చెప్పాలి అంటే టాలీవుడ్ సెలబ్రిటీలకు మాల్దీవ్స్..అనేది ఫేవరెట్ హాలిడే స్పాట్ గా మారిపోయింది అనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడానికి అంతకంటే బెస్ట్ ప్లేస్ లేదు అంటూ మంచు లక్ష్మీ వంటి వాళ్ళే తమ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు అంటే..ఆ ప్రదేశానికి దానికి ఎంత ఆకర్షించబడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.వాళ్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్. సరే ఈ విషాలను పక్కన పెట్టేసి.. ఇప్పటి వరకూ టాలీవుడ్ నుండీ మాల్దీవులకు వెళ్లి వచ్చిన జంటల్ని ఓ లుక్కేద్దాం రండి :

1) అల్లు అర్జున్ – స్నేహ

2) నాగ చైతన్య – సమంత

 

3) నాగార్జున – అమల

4) కాజల్ – గౌతమ్ కిచ్లు

5) మోహన్ బాబు – నిర్మలా దేవి

6) కృష్ణంరాజు – శ్యామలా దేవి

7) కళ్యాణ్ దేవ్ – శ్రీజ

8) మంచు లక్ష్మీ – శ్రీనివాసన్

9) నిహారిక – చైతన్య

10) సునీత- రామ్ వీరపనేని

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus