శతమానం భవతి ఆడియో వేడుకకు రానున్న క్రేజీ హీరోలు

  • November 10, 2016 / 06:50 AM IST

సినిమాల పంపిణీ విభాగంలో ఉన్న రాజు… దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆయన స్థాపించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఇప్పటికీ 23 సినిమాలు విడుదలై మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. 24 వ చిత్రం ఫిదా ముందుగా ప్రారంభించినా హీరో వరుణ్ తేజ్ కి కాలు విరగడంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఈ బ్యానర్లో 25వ చిత్రం గా రూపుదిద్దుకుంటున్న మూవీ “శతమానం భవతి”.  వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు.

తమ బ్యానర్ కి ప్రతిష్టాత్మక చిత్రం అయిన “శతమానం భవతి” ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించాలని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే తన 25 చిత్రాల్లో నటించిన హీరోలను ఒకే వేదికపైకి తీసుకురావాలని కొన్ని రోజుల క్రితం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే అంతమంది వస్తే ఇబ్బంది అవుతుందని అలోచించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో జరిగే ఆడియో ఫంక్షన్ కి విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ బన్నీ, మరికొంతమంది యువ హీరోలు రానున్నట్లు తెలిసింది. టాలీవుడ్ క్రేజీ హీరోలందరూ తరలివస్తే ఈ కార్యక్రమం అవార్డుల ప్రదానోత్సవాన్ని తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus