పూజా మాటలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ లకు దిమ్మతిరిగిందంట

  • September 24, 2018 / 09:39 AM IST

వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న తప్పకుండా రిలీజ్ కావాలని పగలు, రాత్రి అని తేడా లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర బృందాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే సమయంలో ప్రొడక్షన్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేపడుతున్నారు. ఎడిటింగుతో పాటు డబ్బింగ్ ను కూడా చకచకా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ తన షూటింగ్ ని కంప్లీట్ చేసిన పూజా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఇప్పటివరకు ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు.

తొలిసారి తన సినిమాలో చెప్పించాలని త్రివిక్రమ్ అనుకున్నారు. దగ్గరుండి చెప్పించాలని భావించారు. కానీ షూటింగ్ బిజీ వల్ల ఆమె దగ్గర ఉండలేకపోయారు. తీరా డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత చూసుకుంటే.. ఆమె మాటలు ఒక్కటి కూడా అర్ధం కావడం లేదంట. దీంతో షాక్ తిన్న త్రివిక్రమ్.. డబ్బింగ్ ఆర్టిస్ట్ తో మళ్ళీ పూజా పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పూజా పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఎస్ థమన్ స్వరపచిన పాటలను రీసెంట్ గా విడుదల చేశారు. అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకని త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus