రాజమౌళి, త్రివిక్రమ్ లలో ఎన్టీఆర్ అడుగు ఎటువైపు

  • May 30, 2017 / 10:46 AM IST

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొంటూనే నెక్స్ట్ సినిమాపై తారక్ ఓ కన్నేసి ఉంచారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 28 వ సినిమాని చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఈ డ్రీమ్ ప్రాజక్ట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే 28 వ సినిమా విషయంలో మంచి ట్విస్ట్ వచ్చి పడింది. అదే రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా ఏమిటని ఇప్పటి వరకు బయటికి రాలేదు. డివివి దానయ్య బ్యానర్‌లో సినిమా చేస్తారనేది ఖరారు అయింది. హీరో మాత్రం ఫిక్స్ కాలేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఆ హీరో ఎన్టీఆర్ అని తెలిసింది.

అతన్ని దృష్టిలో ఉంచుకొనే జక్కన్న కథను రెడీ చేసే పనిలో ఉన్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సూపర్ హిట్ అయ్యాయి. సో ఈ క్రేజీ కాంబో లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలా ఇటు త్రివిక్రమ్, అటు రాజమౌళి.. వీరిద్దరూ ఇద్దరే. మరి ఎవరితో తారక్ 28వ సినిమా చేస్తారనేది  మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అందుకు సమాధానం త్వరలోనే ఎన్టీఆర్ చెప్పనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus