త్రివిక్రమ్ తో చినబాబుకు పడడం లేదా?

  • November 15, 2017 / 07:01 AM IST

త్రివిక్రమ్ కి రైటర్ గా, డైరెక్టర్ గా, అంతకుమించి వ్యక్తిగా ఎంత మంచి పేరు ఉందో.. తాను తీసే సినిమాలకు నిర్మాతల చేత అనవసరంగా భారీ స్థాయిలో ఖర్చు చేయిస్తాడనే చెడ్డ పేరు కూడా అదే స్థాయిలో ఉంది. టీవీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఖలేజా, అతడు” సినిమాలు థియేటర్లలో ఆడకపోవడానికి, ఆడినా సరైన ప్రాఫిట్స్ రాకుండా కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోవడానికి త్రివిక్రముడే కారణం. ఆ తర్వాత “అత్తారింటికి దారేది” చిత్రానికి కూడా అదే స్థాయిలో ఖర్చు చేయించగా.. పవన్ కళ్యాణ్ క్రేజ్ పుణ్యమా అని సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రొడ్యూసర్ కి పెద్దగా నష్టాలు రాలేదు. ఆ తర్వాత తెరకెక్కించిన “అ ఆ” కూడా సూపర్ హిట్ అయినప్పటికీ.. నిర్మాతకి మిగిలింది మాత్రం చాలా తక్కువే.

ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ అదే మిస్టేక్ ను రిపీట్ చేస్తున్నాడని తెలుస్తోంది. జనవరి 10న విడుదలకావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రాడక్షన్ వర్క్ ఇంకా సగం కూడా పూర్తవ్వలేదు. ముఖ్యంగా సీజీ వర్క్ చాలా పెండింగ్ ఉందట. ఒక్క కంపెనీ వర్క్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికే రెండు నెలలు పడుతుందట. దాంతో.. త్రివిక్రమ్ ఆ వర్క్ ను ముంబై లోని మరో గ్రాఫిక్స్ సంస్థకు షేర్ చేశాడు. వాళ్లేమో డబుల్ చార్జ్ చేస్తున్నారట. ఖర్చు పట్టించుకోని త్రివిక్రమ్ చాలా సింపుల్ గా “ఎంతైనా పర్లేదు.. నాకు వర్క్ పూర్తవ్వడం ఇంపార్టెంట్” అన్నాడట. వాళ్ళేమో ప్రొడ్యూసర్ ఆఫీస్ కి గుండే గుభేలుమనే బిల్లు పంపారట. దాంతో.. త్రివిక్రమ్ తనకు పర్సనల్ గా ఫ్రెండ్ అయినప్పటికీ అతడి తీరుపై మండిపడకుండా ఉండలేకపోయాడట నిర్మాత చినబాబు. డైరెక్ట్ గా ఏమీ అనకపోయినా ఇండైరెక్ట్ గా “మరీ ఇంత ఖర్చంటే కష్టమండీ” అంటూ సుతీమెత్తగా తన పరిస్థితిని వివరించాడట. అయినా సరే త్రివిక్రమ్ ఏమీ పట్టించుకోకుండా కాశీలో మరో మూడు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాడట. దాంతో చినబాబు కోపం నషాళానికి అంటిందని.. త్రివిక్రమ్ తో ఆయనకి ప్రస్తుతం మాటలు లేవని వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus