ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్.. నెక్స్ట్ ఎవరితో..?

  • February 11, 2021 / 07:17 PM IST

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత హైప్ ‘ఉప్పెన’ సినిమాకి వచ్చింది. ఈ సినిమా చాలా కాలంగా ల్యాబ్ లోనే ఉండిపోయినా.. బజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రేక్షకులంతా ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే ఇందులో నటించిన హీరో వైష్ణవ్ తేజ్ కి, హీరోయిన్ కృతిశెట్టికి ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సానాకి కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది.

‘ఉప్పెన’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇదే బ్యానర్ లో బుచ్చిబాబు రెండో సినిమా చేసేలా అగ్రిమెంట్ రాసుకుంది. ఇప్పుడు సినిమాపై ఏర్పడిన బజ్ తో బుచ్చిబాబుపై నమ్మకం మరింత పెరిగింది. దీంతో రెండో సినిమాకి స్టార్ హీరోని ఇస్తామని మూడు ఆప్షన్స్ ఇచ్చిందట మైత్రి సంస్థ. ఆ హీరోలు మరెవరో కాదు.. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. ఈ ముగ్గురు కాల్షీట్లు మైత్రి దగ్గర ఉన్నాయి.

కాబట్టి బుచ్చిబాబు తన కథతో ఏ హీరోని మెప్పిస్తాడో.. వాళ్లతో మైత్రి సంస్థ సినిమాను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఎన్టీఆర్ కి బుచ్చిబాబుకి మధ్య మంచి బాండింగ్ ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడట బుచ్చిబాబు. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉండొచ్చని అని అంటున్నారు. ‘ఉప్పీ’ సినిమాకి వచ్చే టాక్ ని బట్టి బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ వస్తుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus