Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

కీర్తి సురేష్, (Keerthy Suresh) సుహాస్ (Suhas) ప్రధాన పాత్రల్లో ‘ఉప్పు కప్పురంబు’ అనే ఓటీటీ మూవీ రూపొందింది. బాబు మోహన్ (Babu Mohan), శత్రు (Shatru), విష్ణు ఓ ఐ (Vishnu Oi), దువ్వాసి మోహన్ (Duvvasi Mohan), శివన్నారాయణ (Sivannarayana), ప్రభావతి వర్మ వంటి నోటెడ్ ఆర్టిస్టులు కూడా కీలక పాత్రలు పోషించారు. జూలై 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Uppu Kappurambu Trailer

‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ విషయానికి వస్తే ఇది… 2 నిమిషాల 15 సెకన్ల నిడివి కలిగి ఉంది. చిట్టి జయపురం అనే గ్రామం.1990లో ఆ గ్రామానికి చెందిన ఓ ఊరి పెద్ద చనిపోతాడు. దీంతో ఆ ఊరి పెద్ద కూతురు అపూర్వ(కీర్తి సురేష్) (Keerthy Suresh) ని .. ఊరు పెద్దగా నియమిస్తారు.

అయితే ఊరికి చెందిన స్మశానంలో కేవలం నాలుగు శవాలకు తగ్గ చోటు మాత్రమే ఉంటుంది. అది మాకు కావాలంటే… మాకు కావాలి అంటూ ఊర్లో ఉన్న మిగిలిన పెద్దలు గొడవలు పెట్టుకుంటారు. ఆఖరికి ఆ స్థలం కోసం కూడా రాజకీయాలు జరుగుతాయి. చివరికి స్మశానంలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టడం.. అనేది భీభత్సమైన హిలేరియస్ సెటైర్ అని చెప్పాలి.

అని ఐ వి శశి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రాధిక లావు నిర్మాత. కీర్తి సురేష్ (Keerthy Suresh) లుక్స్ బాగున్నాయి. సుహాస్ (Suhas) మేకోవర్ అండ్ కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ అయితే కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

 హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus