రామ్ చరణ్, బోయపాటి సినిమా రైట్స్ సొంతం చేసుకున్న బడా నిర్మాణ సంస్థ

  • June 21, 2018 / 06:19 AM IST

రంగస్థలం మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ ని చెర్రీ లేకుండా కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ లో చరణ్ పై యాక్షన్ సీన్ పూర్తి చేశారు. రీసెంట్ గా బ్యాంకాక్ లో చెర్రీ, కైరా అద్వానీలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, ఓ సాంగ్ షూట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ సాగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ హీరో), నవీన్‌ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ (సొంతం) నటిస్తున్నారు. చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు.

భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టేసిందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ని బడా నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఎక్కువ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నట్లు వివరించారు. టైటిల్ కూడా ఫిక్స్ కాకముందే సినిమా అమ్ముడుపోవడంతో టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతుందని మెగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus