ఇటీవల కాలంలో విలక్షణ నటి అని అనిపించుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ఒకరు. తమిళంతో కెరీర్ను ప్రారంభించిన వరు శరత్ కుమార్.. ఆ తర్వాత తెలుగులో కూడా మంచి సినిమాలు, పాత్రలు చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటావిడ కూడా అయింది. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి హాలీవుడ్కి వెళ్లింది.
అవును వరు తొలి హాలీవుడ్ సినిమా అనౌన్స్ అయింది. ‘రిజానా – ఎ కేజ్డ్ బర్డ్’ సినిమాను రీసెంట్గా అనౌన్స్ చేశారు. శ్రీలంకకు చెందిన సీనియర్ దర్శకుడు చంద్రన్ రుత్నం తెరకెక్కిస్తున్న ‘రిజానా – ఎ కేజ్డ్ బర్డ్’ సినిమాలో ఆస్కార్ అవార్డు గ్రహీత జెరెమీ ఐరన్స్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీలంకలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
రిజానా నఫీక్ అనే శ్రీలంక మహిళ 2013లో సౌదీ అరేబియా వెళ్తుంది. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరుతుంది. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో సినిమా సాగుతుంది అని సమాచారం. ఈ సినిమా టైటిల్ రోల్లో విదుషిక రెడ్డి నటిస్తోంది. ఇందులో మరో కీలక రాజకీయ నాయకురాలి పాత్రలో వరలక్ష్మీ నటిస్తుందట. చంద్రన్ రుత్నం, జెరెమీ ఐరన్స్తో కలసి సినిమా చేయడంతో నా కల నెరవేరింది.
ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి అని ఈ సందర్భంగా వరలక్ష్మీ చెప్పింది. ఇక ‘హను – మాన్’, ‘మైఖేల్’, ‘వీర సింహా రెడ్డి’ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది వరలక్ష్మీ శరత్ కుమార్. (Varalaxmi Sarathkumar) ఇప్పుడు హాలీవుడ్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇక ఇండియన్ సినిమాల సంగతి చూస్తే.. ‘ఫీనిక్స్’, ‘జననాయగన్’ (Jana Nayagan) సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ‘ఫీనిక్స్’ జులై మొదటి వారంలో వస్తుంది. ఇక ‘జన నాయగన్’ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తారు.