Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

మంచు కుటుంబం డ్రీమ్‌ ప్రాజక్ట్‌ ‘కన్నప్ప’ (kannappa) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుస వాయిదాల తర్వాత ఎట్టకేలకు టీమ్‌ తన మాటను నిలబెట్టుకుంటూ రేపు (జూన్‌ 27) సినిమాను రిలీజ్‌ చేస్తోంది. సినిమా షూటింగ్‌ మొదలైంది రెండేళ్ల క్రితమే అయినా.. ఈ ప్రాజెక్ట్‌ వయసు సుమారు 10 ఏళ్లు పైనే కావడం విశేషం. అవును మీరు చదివింది కరెక్టే. 2014లో ఈ సినిమా హక్కుల్ని మంచు విష్ణు కొనుగోలు చేశారు. ఇంకా ఈ సినిమా ప్రయాణంలో కొన్ని ఆసక్తికర సంగతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం!

kannappa

‘కన్నప్ప’ (kannappa) సినిమాను ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో ఏల్లుగా టాలీవుడ్‌లో ఈ చర్చ నడుస్తోంది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను ప్రభాస్‌ (Prabhas) తో చేయాలని అనుకున్నారని టాక్‌. ఆ తర్వాత ఇందులోకి రానా పేరు కూడా వచ్చింది. కానీ కథా హక్కులను తీసుకున్నట్టు 2014లో విష్ణు చెప్పాడు. అప్పటి నుండి ఇతర రచయితలతో కలసి స్క్రిప్ట్‌ పనులు జరిగాయి. ఇక సినిమాను ప్రధానంగా న్యూజిలాండ్‌లోనే తెరకెక్కించారు. అక్కడి నేచర్‌, లొకేషన్స్‌ సినిమాకు బాగా నప్పుతాయని ఎంచుకున్నారు.

అయితే, తొలుత పోలండ్‌లో షూటింగ్‌ చేద్దాం అనుకున్నారు విష్ణు. ఏడేళ్ల క్రితం అక్కడకు వెళ్లి చూసొచ్చారు కూడా. కానీ 2023లో న్యూజిలాండ్‌లో మొదలైంది. ఆ వెంటనే పెద్దగా ఆశ్చర్యం లేకుండా సినిమా పేరును ప్రకటించారు. తమ ‘కన్నప్ప’ (kannappa) హిస్టారికల్‌ మూవీ అని జోనర్‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. గతేడాది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సినిమా టీజర్‌ని విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ‘కన్నప్ప’ (kannappa) కామిక్‌ బుక్‌ తీసుకొచ్చి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం కూడా చేశారు.

ఇక ఈ సినిమాను గతేడాది ఆఖరులో రిలీజ్‌ చేస్తారని తొలుత చెప్పారు. ఆ తర్వాత సంక్రాంతికి రావొచ్చన్నారు. ఆ వెంటనే శివరాత్రికి వచ్చే అవకశం ఉందన్నారు. కొన్ని రోజులకు సమ్మర్‌లో తీసుకొస్తామని చెప్పారు. అలా వరుస వాయిదాలు పడుతూ పడుతూ ఇప్పడు జూన్‌ 27న రిలీజ్‌ అవుతోంది. మధ్యలో సినిమా హార్డ్‌ డిస్క్ చోరీకి గురైంది. ఆ మధ్య కొన్ని సన్నివేశాలు లీక్‌ అయ్యాయి కూడా. హీరోయిన్‌గా తొలుత నుపుర్‌ సనన్‌ని ఎంపిక చేశారు. కొద్ది రోజులకే ఆ ప్లేస్‌లో ప్రీతి ముకుందన్‌ వచ్చింది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), కాజల్ (Kajal Aggarwal) అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. వీరు కాకుండా మరికొందరు స్టార్లు అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో మంచు విష్ణు వారసులు నలుగురూ నటిస్తున్నారు. అరియానా, వివియానా ఓ పాట కూడా పాడారు. చిన్నప్పటి కన్నప్పగా అవ్రామ్‌ కనిపిస్తాడు. ఇంకో సన్నివేశంలో అయ్రా కనిపిస్తుందని మంచు విష్ణు చెప్పారు.

హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus