టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై తాజాగా మరో క్రేజీ టాక్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని స్థాయిలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు మూవీ లవర్స్లో హైప్ పెంచుతోంది.
ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో మైథాలజీ, యాక్షన్, విజువల్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాలకు ప్రత్యేక గుర్తింపైన గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ బ్లాక్స్ ఈ ప్రాజెక్ట్లో మరింత హైలైట్ కానున్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త మేకోవర్లో కనిపించబోతుండగా, హీరోయిన్గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రకు సంబంధించిన డిజైన్పై కూడా భారీ చర్చ నడుస్తోంది.
తాజా టాక్ ప్రకారం, ఈ చిత్రంలో ఓ ప్రత్యేక యాక్షన్ షెడ్యూల్ కోసం దాదాపు నెలరోజుల పాటు నాన్స్టాప్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. భారీ సెట్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, వైల్డ్ అడ్వెంచర్ టోన్తో ఈ ఎపిసోడ్ను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే, గతంలో రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్లకే కొత్త బెంచ్మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ టెక్నీషియన్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రావచ్చనే ప్రచారం కూడా కొనసాగుతోంది. మొత్తానికి, అధికారిక అప్డేట్స్ కంటే ముందే ‘వారణాసి’పై వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఈ యాక్షన్ ఎపిసోడ్పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నదిపైనే ఉంది.