ఆరోజు జరిగిన దానికి పేరెంట్స్ చాల బాధపడ్డారు

  • April 14, 2020 / 06:07 PM IST

టాలీవుడ్ నవ్వుల చిరునామాగా వెన్నెల కిషోర్ మారిపోయారు. ఆయన లేని సినిమా ఉహించుకోలేం. టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వెన్నల కిషోర్ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏ పాత్రకైనా సరిపోయే ఫిజిక్, కామెడీ టైమింగ్ వెన్నెల కిషోర్ ని స్టార్ కమెడియన్ ని చేసింది. తన కామెడీతో అందరినీ నవ్వించే వెన్నెల కిషోర్ జీవితంలో చాల బాధ కలిగించిన సందర్భం ఒకటి ఉందట.

సాఫ్ట్ వేర్ ప్రొఫెషన్ నుండి నటుడిగా మారి కష్టపడి సంపాదించిన సొమ్ముతో సొంత ఇల్లు కట్టుకొని, గృహ ప్రవేశ వేడుక బంధు మిత్రుల సమక్షంలో జరుపుకుంటూ ఉండగా, ఫోన్ కాల్ రావడంతో అర్జెంట్ గా షూట్ కి హాజరు కావలసి వచ్చిందట. ఆ సమయంలో వేడుకలో నేను లేకవడం నా తల్లిదండ్రులను చాల బాధించింది అని చెప్పు కొచ్చారు. ఇక ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, పుష్ప, రంగ్ దే మరియు చిరంజీవి కొరటాల దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారట.

అన్నింటి కంటే ఆచార్య మూవీ చాల ప్రత్యేకం, ఇప్పటికే ఈ మూవీ కోసం ఒక వారం రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను అన్నారు వెన్నెల కిషోర్. ఇక వెన్నెల కిషోర్ కి విలన్ గా చేయాలని కోరిక అట. ఐతే ఓ సారి కమెడియన్ గా ముద్ర పడ్డాక విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు రావని కిషోర్ చెప్పారు. ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో అవకాశం వస్తే విలన్ గా చేస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెన్నల కిషోర్ కి పరిశ్రమలో పెద్దగా పోటీలేదు. సునీల్, సప్తగిరి వంటివారు హీరోలుగా మారి కమెడియన్ హోదా కోల్పోయారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus