రూమర్స్ ను కొట్టిపారేసిన ‘ఉప్పెన’ నిర్మాతలు..!

  • August 21, 2019 / 06:42 PM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బుచ్చి బాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ అనే మాస్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుక్కు రైటింగ్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్టు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు.

అయితే ఇప్పటి వరకూ విజయ్ సేతుపతి షూటింగ్ లో జాయినవ్వలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ నుండీ విజయ్ సేతుపతి తప్పుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అదే నిజమని దాదాపు ఫిక్సయిపోయారు. కానీ తాజాగా ఆ వార్తల్ని కొట్టి పారేస్తూ విజయ్ సేతుపతి షూటింగ్ లో జాయిన్ అయినట్టు సోషల్ మీడియాలో కన్ఫార్మ్ చేసారు చిత్ర నిర్మాతలు. దీనికి ఓ ఫోటీని కూడా జత చేశారు. ఇక ‘ఉప్పెన’ చిత్రం జాలర్ల నేపథ్యంలో సాగే ప్రేమ కథని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus