‘సరిలేరు నీకెవ్వరు’ లో విజయశాంతి, మహేష్ పాత్రలు అవే..!

  • August 12, 2019 / 07:10 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ రావిపూడి కలిసి నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రంతో 13 ఏళ్ళ తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడో కాశ్మీర్ ఆర్మీ లో ఉండే మహేష్ కు విజయ్ శాంతి పాత్రకు అసలు సంబంధం ఏంటి అనే డిస్కషన్లు అప్పుడే మొదలైపోయాయి.

అందుతున్న సమాచారం ప్రకారం.. విజయశాంతి ఈ చిత్రంలో మహేష్ కు తల్లిగా నటిస్తుందట. ఆమె రాయలసీమ నుండీ కొన్ని పరిస్థితుల రీత్యా పారిపోయి హైదరాబాద్ కి వచ్చి సెట్టిల్ అయ్యే పాత్రలో కనిపిస్తుందట. మహేష్ తల్లి విజయ్ శాంతే.. అనే ట్విస్ట్ సినిమాలో ఆకట్టుకుంటుందట. ఇక అటుతరువాత గతం తెలుసుకున్న మహేష్ తల్లికి ఇష్టం లేకపోయినా రాయలసీమ వెళ్ళి అక్కడి పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేస్తాడట. అటు తరువాత విజయశాంతి రాయలసీమకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. 1989 లో మహేష్ తో నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో కూడా విజయశాంతి తల్లిగానే నటిస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ళ తరువాత కూడా మహేష్ కు తల్లిగానే నటిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus