‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్ర?

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుంది.

దాదాపు 30 ఏళ్ళ తరువాత మహేష్ బాబు చిత్రంలో ఈమె నటిస్తుంది. దీంతో ఈమె పాత్ర ఎలా ఉండబోతుందనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో విజయశాంతి… ఊరు బాగుకోసం తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టిన పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతుందట. ఇక విలన్ జగపతిబాబుతో తలపడే పాత్రలో ఆమె కనిపించబోతుందట. ఇంత పవర్ ఫుల్ పాత్ర కాబట్టే ఆమె అంగీకరించినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus