ప్రశాంత్ వర్మ ను.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

  • February 13, 2020 / 08:05 PM IST

ఓ వైపు హీరోగా చేస్తూనే వరుస హిట్లందుకుంటున్న నాని.. ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘అ!’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఏకంగా రెండు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలుపుకుంటే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. అంటే హిట్ అనే చెప్పాలి. కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. అటు ఇటుగా అయితే ‘అ!’ సినిమాని కమర్షియల్ హిట్ అనే చెప్పాలి.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ తీయబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. నిర్మాత నాని కూడా ఈ చిత్రం సీక్వెల్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. వీరి మధ్యలో ఏదైనా మనస్పర్థలు వచ్చాయా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇటీవల ‘అ!’ చిత్రం దర్శకుడు.. ‘ఈ చిత్రం సీక్వెల్ ను ఏడాది క్రితమే రెడీ చేసినట్టు చెప్పుకొచ్చాడు. అయితే నాని ని మాత్రం సంప్రదించలేదు అని కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో నిజంగానే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. మరో పక్క ప్రశాంత్ వర్మ.. హీరో రాజశేఖర్ తో చేసిన ‘కల్కి’ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. ప్రశాంత్ డైరెక్ట్ చేసిన మరో చిత్రం.. ‘క్వీన్’ రీమేక్ అయిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రాన్ని కొనుకొనుగోలు చేయడానికి బయ్యర్స్ కూడా రావడం లేదు. అందుకే నాని ప్రశాంత్ వర్మతో ‘అ!’ సీక్వెల్ నిర్మించడానికి వెనుకడుగు వేస్తున్నాడా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. మరి అసలు విషయం ఏంటో.. నాని స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus