ప్రభాస్ తరువాత బాలీవుడ్ ని ఏలే ఆ కింగ్ ఎవరు?

  • July 16, 2020 / 01:22 PM IST

2021 మన టాలీవుడ్ స్టార్స్ కి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన వీరు బాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 2021లో మన టాలీవుడ్ స్టార్స్ మొత్తం మూకుమ్మడిగా బాలీవుడ్ పై దాడి చేయనున్నారు. ఎన్టీఆర్, చరణ్, మహేష్, పవన్ మరియు బన్నీ పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించేశారు. ఈ చిత్రాలు మొత్తం వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. చరణ్ గతంలో జంజీర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ అంతగా ఆడలేదు.

కాగా ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ తో కలిసి మరో మారు అక్కడ తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఇక ఎన్టీఆర్ మొదటిసారి ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక పవన్ దర్శకుడు క్రిష్ తో చేస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. మొఘలుల కాలం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీ బాలీవుడ్ కి సెట్ అవుతుంది. అందుకే ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కావడం ఖాయం.

ఇక మహేష్ సర్కారు వారి పాట, బన్నీ పుష్ప కుడా పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు బంపర్ హిట్ అందుకొని బాలీవుడ్ లో జెండా ఎగరేస్తారో చూడాలి. టాలీవుడ్ నుండి ఒక్క ప్రభాస్ మాత్రమే బాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు. ఆయన నటించిన బాహుబలి చిత్రాలతో పాటు సాహో కూడా హిట్ అందుకుంది. మరి ప్రభాస్ తరువాత బాలీవుడ్ ని ఏలే ఆ కింగ్ ఎవరో వచ్చే ఏడాది తెలియనుంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus