‘పండగ పూట కూడా పాత మొగుడేనా’.. ఇటీవల లయని(Laya) ఉద్దేశించి సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్ ఇది. విషయం ఏంటంటే.. ఇటీవల ‘వదలా’ ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. హీరోయిన్ లయని ఓ రిపోర్టర్ ఈ విధంగా ప్రశ్నించాడు. “మీరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వత.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన మీ హీరోలకి మళ్ళీ హీరోలుగా చేసే అవకాశం లభిస్తుంది. నిజంగా ఇదొక యాదృశ్చికమేనా” అన్నట్టు ప్రశ్నించాడు.
అందుకు లయ కూడా ‘నిజమే’ అని చెప్పి సరదాగా నవ్వుకుంది. అయితే ఆ తర్వాత సహా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్… ‘పండగపూట కూడా పాత మొగుడేనా’ అని అంటున్నారా అంటూ ఓ సెటైర్ విసిరాడు. ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలో చాలా డెప్త్ ఉంది. లయ రీ ఎంట్రీ ఇచ్చాక ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన సీనియర్ హీరోలు శివాజీ, జగపతి బాబు, శ్రీకాంత్..లకి మళ్ళీ హీరోలుగా చేసే అవకాశం లభించింది.
వీళ్ళు హీరోలుగా చేసిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ‘వదలా’ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ వంటి సినిమాల్లో హీరోయిన్ కూడా లయనే కావడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే రీ-ఎంట్రీలో లయకి ఇంకా సరైన హిట్టు పడలేదు. ఈ వారం అయితే లయకి కీలకంగా మారింది. ఎందుకంటే ఆమె జగపతి బాబు సరసన నటించిన ‘వదలా’, శ్రీకాంత్ సరసన నటించిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమాలు ఈ శుక్రవారమే అంటే జూలై 17నే విడుదల కానున్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్టైనా..లయ సెకండ్ ఇన్నింగ్స్ కి బుస్టప్ అందినట్టే..!