‘గేమ్ ఛేంజర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది'(Peddi) సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్, రై రై రారా వంటివి అన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ‘పెద్ది’ పై మొదటి నుండి పాజిటివిటీ ఏర్పడింది. క్రమ క్రమంగా అది పెరుగుతూనే వస్తుంది.
రామ్ చరణ్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన లుక్ అంతా మార్చుకుని ‘పెద్ది’ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాపై అతను చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడని చెప్పొచ్చు.ఇదిలా ఉండగా.. ‘పెద్ది’ సినిమా మొదట మార్చి 27న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఫుటేజీ 4 గంటల వరకు వచ్చిందట.
దీంతో ఇప్పుడు ఎడిటర్ నవీన్ నూలిపై భారం పడినట్టు అయ్యింది. దర్శకుడు బుచ్చిబాబు.. ఎడిటర్ తో కూర్చుని.. ఫైనల్ రన్ టైం 3 గంటలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద సినిమాలకి 4 గంటల వరకు ఫుటేజీ రావడం పెద్ద విడ్డూరం ఏమీ కాదు. పైగా బుచ్చిబాబు… తన గురువు సుకుమార్ మాదిరి పర్టిక్యులర్ గా ఉండే పర్సన్. తాను రాసుకున్న ప్రతి సన్నివేశం తెరపై ఉండాలనే ఆశ సహజంగానే ఎక్కువగా ఉంటుంది.
ఏదైతేనేం.. సినిమా కనుక బాగుంటే.. రన్ టైంని ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. ఒకవేళ కంటెంట్ బాగోకపోతేనే ఇబ్బంది.