Anandaiah’s Medicine: జగపతి పోస్ట్ పై ట్విట్టర్ లో రచ్చ!

Advertisement

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, సైంటిస్ట్ లకు అంతుచిక్కని కరోనా మహమ్మారి ఆనందయ్య మందుతో నయం అవుతుందనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో అందరూ ఈ నాటు వైద్యంపై మొగ్గు చూపుతున్నారు. ఈ మందుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ జనం మాత్రం ఎగబడుతున్నారు. ఆనందయ్య నాటు వైద్యానికి ప్రజల మద్దతు బాగానే లభిస్తోంది. వేల సంఖ్యంలో జనం ఈ మందుని దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆనందయ్య నాటు మందు కోసం తెగ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చే వరకు ప్రభుత్వం ఈ మందు పంపిణీను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నటుడు జగపతి బాబు రియాక్ట్ అవుతూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు.

తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మనల్ని కాపాడేందుకు ప్రకృతి ముందుకొచ్చినట్లు అనిపిస్తోందని.. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. కొంతమంది జగపతి పోస్ట్ కి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఎలాంటి అప్రూవల్ లేని మందులకు ఎలా సపోర్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. జనాలకు ఫాల్స్ హోప్ ఇవ్వొద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus