టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

  • May 24, 2021 / 07:52 PM IST

గతంలో తెలుగులో చాలా సీక్వెల్స్ రూపొందాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ను చూసి ఎవ్వరూ ‘జిందాబాద్’ కొట్టలేదు. ‘ఆర్య 2’ లవ్ ను ఎవ్వరూ ‘ఫీల్’ అవ్వలేదు. ‘కిక్2’ లో జనాలకు ‘కిక్’ దొరకలేదు. ‘మన్మధుడు 2’ లో ‘మన్మధుడు’ కనబడలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ‘గబ్బర్ సింగ్’ ఎలివేషన్స్ లేవు. కేవలం లారెన్స్, హరి మాత్రమే సక్సెస్ అయ్యారు. అవి కూడా డబ్బింగ్ సినిమాలైన ‘ముని’ ‘సింగం’ ల సిరీస్ లతో..! దాంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. సీక్వెల్ అంటేనే భయం పెట్టేసుకున్నారు. చాలా మంది వీటి జోలికి పోకూడదని డిసైడ్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం మళ్ళీ సీక్వెల్స్ బాట పట్టారు. ప్రస్తుతం టాలీవుడ్లో 10 కి పైనే సీక్వెల్స్ రూపొందుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బంగార్రాజు:

2015 లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుంది. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు.

2) ఎఫ్3:

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్ ఇది. దీనికి దిల్ రాజు నిర్మాత. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

3) దృశ్యం 2:

వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈసారి జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

4) కార్తికేయ2:

నిఖిల్, చందూ మొండేటి డైరెక్షన్లో వచ్చిన ‘కార్తికేయ’ కు సీక్వెల్ ఇది. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ సీక్వెల్ ను నిర్మిస్తున్నారు.

5) గూఢచారి 2:

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరెక్షన్లో తెరకెక్కిన ‘గూఢచారి’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

6) కె.జి.ఎఫ్ 2:

2018 లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘కె.జి.ఎఫ్’ కు సీక్వెల్ ఇది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

7) ఢీ టు ఢీ:

2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఢీ’ కి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందనుంది.దీనిని హీరో విష్ణునే నిర్మించనున్నాడు.

8) జాతి రత్నాలు2:

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామ కృష్ణ,ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘జాతి రత్నాలు’ కి ఇది సీక్వెల్ గా రూపొందనుంది.

9) క్రాక్ 2:

 

‘క్రాక్’ కు సీక్వెల్ తీస్తున్నట్టు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేనినే ప్రకటించాడు. అయితే అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే విషయాన్ని మాత్రం తెలుపలేదు.

10) జాంబీ రెడ్డి2:

టాలీవుడ్లో వచ్చిన ఫస్ట్ జాంబీ మూవీకి కూడా ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus