Divyavani: వైరల్ అవుతున్న దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!

  • February 2, 2023 / 05:03 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటి దివ్యవాణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాలు ఒకే ఏడాది విడుదలయ్యాయని మూడు సినిమాలు సక్సెస్ సాధించడంతో హ్యాట్రిక్ సొంతమైందని దివ్యవాణి అన్నారు. ఆ సమయంలో హిట్ చిత్రాల కథానాయకి అని నా గురించి కామెంట్ వచ్చిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత నరేష్, శ్రీకాంత్ గారితో సినిమాలు చేశానని దివ్యవాణి అన్నారు.

కొన్ని మంచి సినిమాలను నేను చేయాల్సి ఉన్నా చేయలేదని ఆమె కామెంట్లు చేశారు. బయటకు చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల కూడా ఆ సినిమాలు నేను చేయలేదని దివ్యవాణి అన్నారు. వాళ్ల ఈగోలకు మేము బలై ఆఫర్లు పోగొట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె తెలిపారు. పెళ్లి పుస్తకం సినిమాలో మొదట ఛాన్స్ దక్కిందని దివ్యవాణి అన్నారు. నేను ఇండస్ట్రీకి సెట్ కానని భావించిన సమయంలో ముత్యమంత ముగ్గు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ లో చేయడంతో

ఆ సినిమా ద్వారా పెళ్లి పుస్తకం సినిమాలో ఛాన్స్ దక్కిందని దివ్యవాణి తెలిపారు. బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనే గుర్తింపు రావడం సంతోషం కలిగించిందని ఆమె కామెంట్లు చేశారు. ప్రతి పెళ్లిలో పెళ్లి పుస్తకం మూవీ ఉంటుందని దివ్యవాణి చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ తో మూడు సినిమాలు చేశానని ఆమె కామెంట్లు చేశారు. మిష్టర్ పెళ్లాం సినిమాలో కూడా నేను చేయాల్సి ఉందని దివ్యవాణి పేర్కొన్నారు.

మిష్టర్ పెళ్లాం కోసం చేతులు పట్టుకోవడం, కాళ్లు పట్టుకోవడం జరిగిందని కానీ ఆ సినిమాలో చేయలేదని దివ్యవాణి వెల్లడించారు. ఛాన్స్ ఎందుకు మిస్ అయిందో చెప్పడం కరెక్ట్ కాదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. దివ్యవాణి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus