టాలీవుడ్ ఇండస్ట్రీ పై మాధవీ లత షాకింగ్ కామెంట్స్..!

  • August 31, 2020 / 04:18 PM IST

ప్రముఖ హీరోయిన్ మరియు బి.జె.పి నాయకురాలు అయిన మాధవీ లత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు ‘అతిథి’, నాని ‘స్నేహితుడా’, తనీష్ ‘నచ్చావులే’ వంటి సినిమాల్లో నటించి ఆ తరువాత మాయమైపోయి.. రాజకీయాల్లో ప్రత్యక్షమైంది. 2019 ఎన్నికల్లో బి.జె.పి పార్టీ తరుపున గుంటూరు నుండీ పోటీ చేసిన మాధవీ లత ఘోరంగా ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. అప్పుడప్పుడూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది మాధవీ లత అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు కూడా టాలీవూడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘టాలీవుడ్ లో జరిగే పార్టీల్లో కూడా డ్ర‌గ్స్‌ (drugs) ను వాడుతారు. దీని పై తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అలాగే ప్ర‌భుత్వం వారు ప్ర‌త్యేక‌మైన శ్రద్ధ పెట్టాలి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఎన్.సి.బి అధికారులు అడుగుపెట్టడం మంచిదే..! అయితే కేవలం బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ ‌పై కూడా దృష్టి పెట్టండి.

ఇక్కడ జరిగే దారుణాలను కూడా అరికట్టండి’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక బాలీవుడ్ లో కంగనా కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సరైన చర్యలు చేపడితే బాలీవుడ్లో చాలా మంది స్టార్లు జైలులో కూర్చుంటారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus