Pooja Hegde: ఆ నగరంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన పూజా హెగ్డే.. ఏమైందంటే?

  • April 14, 2024 / 03:32 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగులో ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. అయితే తెలుగులో పూజా హెగ్డే బిజీ కాకపోయినా ఇతర ఇండస్ట్రీలలో మాత్రం పూజా హెగ్డేకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి. తాజాగా పూజా హెగ్డే ముంబైలోని బాంద్రా నగరంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ విలువ 45 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. పూజా హెగ్డే తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఈ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఖర్చు చేశారు.

ఒక హీరోయిన్ ప్రాపర్టీ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయడం సులువైన విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూజా హెగ్డే తన సంపాదనతో నెటిజన్లను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనే చెప్పాలి. 4,000 చదరపు అడుగుల విస్తీరణం ఉన్న ప్రాపర్టీని పూజా హెగ్డే కొనుగోలు చేశారు. పూజా హెగ్డేకు ముంబైలో ఇప్పటికే ఫ్లాట్ ఉన్నా మరో ఖరీదైన ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేయడం గమనార్హం.

బాంద్రాలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలకు ఖరీదైన ప్రాపర్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరారని చెప్పవచ్చు. త్వరలో పూజా హెగ్డే షాహిద్ కపూర్ కు (Shahid Kapoor) జోడీగా ఒక సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాతో పూజా హెగ్డే మరో సక్సెస్ అందుకుంటానని నమ్ముతున్నారు.

పూజా హెగ్డే ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం పెంచుకుంటున్నారు. పూజా హెగ్డే తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగులో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus