Priyamani: పుకార్లకు చెక్ పెట్టిన హీరోయిన్ ప్రియమణి!

  • October 26, 2022 / 12:59 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ప్రియమణి మ్యారీడ్ లైఫ్ పై పుకార్లు వినిపిస్తున్నాయి. తన భర్తతో ప్రియమణికి గొడవలు జరిగాయని.. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండడం లేదని ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది ప్రియమణి. పుకార్లు వచ్చినప్పుడు అనవసరంగా స్పందించడం ఎందుకని సైలెంట్ గా ఉన్నట్లు చెప్పింది.

ఇదే సమయంలో ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. త్వరలోనే ఈ వార్తలు కనుమరుగవుతాయని చెప్పింది. ప్రియమణి దీపావళి వేడుకలను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అందులో ముస్తఫా రాజ్ లేరు. ఈ విషయంపై ఆమెని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని.. అందుకే ఫ్యామిలీ ఫొటోల్లో కనిపించలేదని వివరించింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లలో కూడా ముస్తఫాను మిస్ అవుతున్నట్లు ప్రియమణి పేర్కొంది.

ప్రియమణి పెళ్లై ఐదేళ్లు అవుతోంది. 2017 ఆగస్టులో ఆమె వివాహం చేసుకుంది. ముస్తఫాకు ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడిపోయిన ఆయన తరువాత ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడు. మొన్నామధ్య ముస్తఫా మొదటి భార్య కోర్టుకెక్కింది. ముస్తఫా తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదని గొడవ చేసింది.

ఆ సమయంలో ప్రియమణి తన భర్తకు అండగా నిలిచింది. ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ‘డాక్టర్ 56’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే నాగచైతన్య సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ ‘జవాన్’లో కూడా కనిపించనుంది. తన కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా ఉంది ప్రియమణి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus