Rakul Preet: స్క్రీన్ పై టైటిల్స్ చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్!

  • August 28, 2021 / 09:24 AM IST

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ లో హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అతి కొద్దికాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. వరుస సినిమాలతో ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అయితే కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న ఈ బ్యూటీ తిరిగి పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ‘కొండపొలం’, ‘భారతీయుడు 2’, ‘ఎటాక్’, ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ లాంటి సినిమాల్లో నటిస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా రకుల్ కంటతడి పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఏంటంటే.. చాలా రోజుల తరువాత థియేటర్లో సినిమాలు చూడడంతో రకుల్ ఎమోషనల్ అయిందట. అక్షయ్ కుమార్ హీరోగా దర్శకుడు రంజిత్ తివారీ ‘బెల్ బాటమ్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రకుల్ కీలకపాత్ర పోషించింది. తాజాగా చిత్రబృందంతో కలిసి రకుల్ సినిమా చూసిందట. చాలా నెలల తరువాత థియేటర్లో సినిమా చూడడంతో స్క్రీన్ పై టైటిల్స్ పడగానే భావోద్వేగానికి గురైంది.

ఈ విషయాన్ని రకుల్ స్వయంగా చెప్పింది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సినిమాను థియేటర్ లో విడుదల చేసిన చిత్రయూనిట్ కి ఆమె ధన్యవాదాలు తెలిపింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus