సవ్యసాచిలోని ప్రత్యేక పాటలో ఎవరు కనిపిస్తారో ?

  • April 13, 2018 / 12:59 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఓ పెద్ద హిట్‌గా నిలిచిన “అల్లరి అల్లుడు” చిత్రంలోని “నిన్ను రోడ్ మీద చూసినది” పాట కుర్రకారుని ఓ ఊపు ఊపింది. ఇందులో రమ్యకృష్ణ అందం, డ్యాన్స్ లతో అదరగొట్టింది. ఆ పాటను ఇప్పుడు నాగచైతన్య అందుకున్నారు.  డైరక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చైతూ సవ్యసాచి చేస్తున్నారు. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఒక ప్రత్యేక పాట మాత్రమే మిగిలి ఉంది.

ఆ పాటే “నిన్ను రోడ్ మీద చూసినది” రీమిక్స్. అప్పట్లో ఆ పాటను అందించిన కీరవాణినే ఇప్పుడు మళ్లీ రీమిక్స్ చేయడం విశేషం. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ స్పెషల్ సాంగ్  మరో హీరోయిన్ తో చేయించాలని డైరక్టర్ భావిస్తున్నారు. అందుకోసం ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ తమన్నా, శృతి హాసన్, కాజల్, పూజ హెగ్డే లు చేసిన ఐటెం సాంగ్స్ సినిమాలకు ప్లస్ అవుతున్నాయి. అందుకే రకుల్ తో చేయిస్తే ఫ్రెష్ ఫీల్ వస్తుందని భావిస్తున్నారు. ఆమె ఒప్పుకోకుంటే కాజల్ ని అడగాలని అనుకుంటున్నారు. చివరికి ఈ పాటలో ఎవరు స్టెప్పులు వేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus