టాలీవుడ్ హీరోయిన్ ఇషితా దత్తా (Ishita Dutta) మళ్ళీ తల్లి అయ్యింది. తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. ‘2 గుండెల నుండి 4 గుండెలు అయినందుకు సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ లెక్క ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. మాకు పాప జన్మించింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. 2017 లో ఇషితా.. బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ (Vatsal Sheth) ను పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. ఆల్రెడీ ఈ దంపతులకి ఓ బాబు ఉన్నాడు.
ఇప్పుడు రెండో సంతానంగా వీరికి పాప జన్మించినట్టు స్పష్టమవుతుంది. ఇక ఇషితా దత్తా పోస్ట్ కి సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు ‘కంగ్రాట్స్’ అంటూ తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఇషితా దత్తా 2012 లో తనీష్ (Tanish)హీరోగా వచ్చిన ‘చాణక్యుడు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గొట్టిగింటి శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. దీంతో ఇషితాకి తెలుగులో సరైన ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. ‘దృశ్యం’ (Drushyam) ‘దృశ్యం 2’ (Drushyam 2) వంటి సినిమాల్లో అజయ్ దేవగన్ (Ajay devgn) కి పెద్ద కూతురి పాత్రలో నటించి పాపులర్ అయ్యింది.
కొన్నాళ్లుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక ఈమె భర్త..వత్సల్ సేథ్ కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్'(Adipurush) సినిమాలో ఇతను ఇంద్రజిత్ పాత్రలో కనిపించాడు.