Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

పాన్‌ ఇండియా సినిమాలు, పాన్‌ వరల్డ్‌ సినిమాలు.. ఇండియన్‌ సినిమాకు ఇంటర్నేషనల్‌ టీమ్‌ పని చేయడం, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పని చేయడం అంటూ.. ఇప్పుడు గొప్పగా చెబుతున్నారు కానీ.. ఇలాంటి సెటప్‌ టాలీవుడ్‌లో ఎప్పుడో చూసేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా పూర్తవ్వలేదు. ఒకవేళ షూటింగ్‌ పూర్తి చేసుకొని, రిలీజ్‌ అయి ఉంటే ‘మీరు ఇప్పుడు చెబుతున్నవన్నీ మా హీరో ఎప్పుడో చేసేశాడు’ అని చిరంజీవి ఫ్యాన్స్‌ చెప్పేవారు. ఎందుకంటే మేం చెప్పిన సినిమా ‘అబు: బాగ్దాద్‌ గజదొంగ’ కాబట్టి.

Abu Baghdad Gajadonga

ఎప్పుడో మొదలై, ఎప్పుడో ఆగిపోయి.. దాదాపు అందరూ మరచిపోయిన ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అంటున్నారా? అప్పట్లో ఆ సినిమా కోసం పని చేసిన దర్శక ద్వయం పుష్కర్‌ – గాయత్రి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి. ‘విక్రమ్ వేద’ సినిమాతో అలరించిన వీరు ఇప్పుడు వరుస వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. అవే ‘సుడల్‌’, ‘వదంతి’. ఇప్పుడు ‘వదంతి 2’ వెబ్‌సిరీస్‌తో వచ్చారు. ఆ సిరీస్‌ ప్రచారంలో భాగంగా ‘అబు: బాగ్దాద్‌ గజదొంగ’ / ‘ది రిటర్న్‌ ఆఫ్‌ ది థీఫ్‌ ఆఫ్‌ బాగ్దాద్‌’ సినిమా గురించి మాట్లాడారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో గాయత్రి ఆ సినిమాకు సహాయక దర్శకురాలిగా పనిచేయగా, కెమెరా విభాగంలో పుష్కర్‌ పని చేశారట. అప్పట్లో ఈ సినిమాకు దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌ అనుకున్నారట. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందించాలి అనుకున్న ఆ సినిమా ఇండియన్‌ వెర్షన్‌కు సురేశ్‌ కృష్ణ దర్శకత్వం చేయాల్సి ఉండగా.. ఇంగ్లీష్‌ వెర్షన్‌కు డచెన్‌ జెర్సీ అనే హాలీవుడ్‌ దర్శకుడు అనుకున్నారట. హాలీవుడ్‌ నుండే కాకుండా బ్రిటన్‌, ఆస్ట్రేలియా నుండి సినీ నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారట.

ఈ సినిమా షూటింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చేయాలనుకున్నారట. తొలుత మూడు నెలల పాటు అజంత, ఎల్లోరా, ఔరంగాబాద్‌, రాజస్థాన్‌, జైపూర్‌, జైసల్మేర్‌, థార్‌ ఎడారిలో చేశారట. ఈ సినిమా కోసం అప్పట్లో అరుదుగా వాడే కెమెరా మోషన్‌ కంట్రోల్‌ రిగ్స్‌ను తొలిసారి ఇండియాకు తీసుకొచ్చారట.

వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus