ఆఫర్లు లేకపోయినా.. ఐశ్వర్య ఇప్పటికీ తగ్గడం లేదు!

  • July 13, 2019 / 01:19 PM IST

ఒక అమ్మయి అందం గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ ఐశ్వర్య రాయ్ పేరునే తలుచుకుంటూ ఉంటారు. అందానికి కేర్ అఫ్ అడ్రెస్ అంటే ఐశ్వర్య అని అప్పటి కుర్రకారు మాత్రమే కాదు ఇప్పటి కుర్ర కారు కూడా చెబుతుంటారు. ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ చిత్రం తో హీరోయిన్ గా పరిచయమైంది ఐశ్వర్య రాయ్. తెలుగులో ఆ చిత్రాన్ని ‘ఇద్దరు’ పేరుతో రీమేక్ చేశారు. అటు తరువాత ఆమె బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా తమిళంలో సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్రం ఆమె హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కింగ్ నాగార్జున నటించిన ‘రావోయి చందమామ’ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది తప్ప.. హీరోయిన్ గా మాత్రం ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు ఐశ్వర్య రాయ్.

స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల పక్కన హీరోయిన్ గా చేయమని కొందరి దర్శకులు సంప్రదించినా… ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ మన స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కు డబుల్ ఉండటంతో వారు లైట్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు తమిళంలో కానీ బాలీవుడ్ లో కానీ పెద్దగా సినిమాలు లేవు. దాదాపు ఆమె ఊపు కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో.. చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో సినిమా చేయమని సంప్రదించగా ఇప్పుడు కూడా ఆమె భారీ రెమ్యూనరేషన్ చెబుతుందట. అంతేకాదు కనీసం తగ్గడం లేదని సమాచారం. దీంతో చిత్ర నిర్మాతలు ఆమెను లైట్ తీసుకుని మరో హీరోయిన్ కోసం వెతుకులాడుతున్నట్టు తెలుస్తుంది. ‘తెలుగులో సినిమా చేస్తే ఆమె స్థాయి తగ్గిపోతుందా ఏంటి…. టాలీవుడ్ అంటే ఆమెకు అంత చిన్న చూపు ఎందుకు’ అంటూ ఫిలింనగర్ లో ఐశ్వర్య పై కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus