Akhil: ‘ఆర్ఎక్స్100’ డైరెక్టర్ తో అఖిల్!

  • April 19, 2021 / 01:58 PM IST

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ.. వరుస విజయాలు అందుకుంటూ అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతుంది మైత్రి మూవీస్. ఇండస్ట్రీలో పేరున్న హీరోలందరితో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరో యంగ్ హీరోని లాక్ చేసినట్లు సమాచారం. అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని భావిస్తుంది మైత్రి సంస్థ. దీనికోసం దర్శకుడు అజయ్ భూపతిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే అజయ్ భూపతి ఓ మంచి లైన్ ను మైత్రి వాళ్లకు చెప్పినట్లు సమాచారం.

తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఓ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ తో అజయ్ భూపతి రాసుకున్న లైన్ ను అఖిల్ కి వినిపించారట. లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ గనుక ఓకే అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే సురేందర్ రెడ్డితో ఓ సినిమా మొదలుపెట్టాడు అఖిల్.

మరోపక్క అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజైన రెండేళ్లకు ‘మహాసముద్రం’ సినిమాను మొదలుపెట్టాడు. శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్టణంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత అఖిల్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus