సత్య ప్రభాస్ డైరెక్షన్లో అఖిల్ చిత్రం.. ఫిక్స్..!

  • February 7, 2019 / 05:20 AM IST

తన మూడో చిత్రంతో కూడా అక్కినేని అభిమానులని నిరాశపరిచాడు అఖిల్. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రం మంచి టాక్ ని సంపాదించుకున్నప్పటికీ.. బయ్యర్లకి లాభాల్ని తెచిపెట్టలేకపోయింది. ‘హలో’ చిత్రం తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని చేసినా ఫలితంలేకపోయింది. దీంతో ఇక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నాల్గవ చిత్రాన్ని మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడట అఖిల్. అయితే క్రిష్ డైరెక్షన్లో అఖిల్ నాల్గవ చిత్రం ఉంటుందని.. మొన్నటి వరకూ వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజంలేదని తాజా సమాచారం.

ప్రస్తుతం అఖిల్ ‘మలుపు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సత్య ప్రభాస్ పినిశెట్టి డైరెక్షన్లో తన నాల్గవ చిత్రాన్ని చేయబోతున్నట్టు తెలుస్తుంది. నిజానికి అఖిల్ మూడవ చిత్రం సత్య ప్రభాస్ తోనే చేయాల్సి ఉందట. అయితే ఇది యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ లవ్ స్టోరీ తీసి హిట్ కొట్టాక సత్య ప్రభాస్ తో సినిమా చేయాలని అఖిల్ ఆశించాడట. అయితే ‘మిస్టర్ మజ్ను’ ప్లాప్ గా మిగలడంతో… ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్య ప్రభాస్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట అఖిల్. దీనికి నాగార్జున కూడా ఓకే చెప్పేసాడని తెలుస్తుంది.దీంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారు అయిపోయినట్టే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలయిపోయాయట. మార్చిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus